అనారోగ్యంతోనే టెన్త్ పరీక్షలు రాసిన స్టూడెంట్

Feb 26, 2020, 11:56 AM IST

ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఒక విద్యార్థిని  యూపీ రాష్ట్రంలోని బరేలీలో ఆక్సిజన్ సిలిండర్‌తో  పరీక్ష రాశారు.ఆక్సిజన్ సరఫరా మీద ఆధారపడే సఫియా జావేద్ ప్రభుత్వ బాలికల ఇంటర్ కాలేజీలో తన పరీక్షలను రాశారు. తనకు తన కుటుంబం నుండి చాలా మద్దతు లభిస్తోందన్నారు. సమస్యలను అధిగమించడానికి ఇది సహాయపడుతుందని చెప్పారు. కంప్యూటర్ సైన్స్ అంటే తనకు ఇష్టమని ఆమె చెప్పారు.