Feb 19, 2022, 5:03 PM IST
జాతీయ రాజకీయాల్లో వినూత్నమైన ప్రచార పంథాతో దూసుకుపోయే పార్టీ భారతీయ జనతా పార్టీ. సోషల్ మీడియాను విస్తృతంగా వాడకంలోకి తీసుకొచ్చి యువతను ఆకర్షించిన కాషాయ పార్టీ తాజాగా సంజ్ఞల భాషను ఎన్నికల ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా యోగి సర్కార్ చేసిన పనులను సైన్ లాంగ్వేజ్ ద్వారా వివరిస్తున్న వీడియోని తీసుకువచ్చారు.