ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ : నేతాజీ విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ తో...

Sep 25, 2022, 3:00 PM IST

ఇండియా గేట్ వద్ద సెప్టెంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. యావన్మంది భారతీయులు గర్వించదగ్గ విషయం. ఆ విగ్రహాన్ని చూసినవారంతా అద్భుతం అని తప్ప వేరే ఏమి అనలేకపోతున్నారు. ఆ సుందర శిల్పాన్ని చూడగానే ... చెక్కిన శిల్పి ఎవరబ్బా అనే సందేహం మన మనస్సులో మెదలడం ఖాయం..! ఏషియానెట్ డైలాగ్స్ లో మనతోపాటుగా ఈరోజు ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఉన్నారు..! ఆయాన్నడిగి ఆ విగ్రహం గురించిన అనేక విషయాలను, ఆయన ప్రయాణాన్ని తెలుసుకుందాం..!