video: తమిళనాడులో భారీ వర్షాలు... భవనం కూలి 15 మంది బలి

Dec 2, 2019, 9:53 PM IST

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునిగి జనజీవనం స్తంభించిపోయింది. ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షాలకు శిథిలావస్థలో ఉన్న భవనాలు కూలుతున్నాయి. తాజాగా, కోయంబత్తూరు మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాలుగు భవనాలు కూలి కనీసం 15 మంది మృతి చెందారు.