ప్రపంచ దేశాలకు పాకుతున్న కరోనా.... ఇటలీలో తొలి మరణం నమోదు

Feb 22, 2020, 3:14 PM IST

కరోనా వైరస్ తో ఇటలీలో మొదటి మరణం నమోదయ్యిందని స్థానిక మీడియా తెలిపింది. అంతకుముందే, యూరోపియన్ దేశంలో 14 కొత్త కరోనావైరస్ కేసులను కనుగొన్నట్టుగా హెల్త్ అఫీషియల్స్ తెలిపారు. ఈ మరణంతో కరోనా సోకినవారి సంఖ్య 17 కి చేరుకుంది. చైనాలో ఇప్పటికే 2239 మంది ఈ వైరస్ తో మరణించారు.