డ్రైవర్ శ్రీనివాసరెడ్డికి కోదండరాం నివాళులు(వీడియో)

Oct 13, 2019, 1:05 PM IST

శనివారం నాడు సాయంత్రం కిరోసిన్ పోసుకొని శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శ్రీనివాస్ రెడ్డిని అడ్డుకొనేందుకు ప్రయత్నించిన కొడుకు కూడ గాయాలయ్యాయి. 90 శాతం శ్రీనివాస్ రెడ్డి శరీరం కాలిపోయింది.

ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేసిన తర్వాత శ్రీనివాస్ రెడ్డిని మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్ డిఆర్‌డిఓ అపోలో ఆసుపత్రికి తరలించారు.

శనివారం రాత్రి నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ రెడ్డి ఆదివారం నాడు మృతి చెందాడు. శ్రీనివాస్ రెడ్డి బౌతిక కాయాన్ని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వథామరెడ్డి తో పాటు పలు పార్టీల నేతలు సందర్శించి నివాళులర్పించారు.