బిగ్ బాస్ రియాలిటీ షో ముసుగులో చాలా ఉంది.. శ్వేతారెడ్డి(వీడియో)

Jul 19, 2019, 6:51 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న బిగ్ బాస్ సీజన్ 3కి రంగం సిద్ధం అయింది. జులై 21 ఆదివారం సాయంత్రం 9 గంటలకు బిగ్ బాస్ సీజన్ 3 తొలి ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. కానీ కొన్ని వివాదాలు మాత్రం ఈ షోని వెంటాడుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా బిగ్ బాస్ షోకు తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. అదే స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల యాంకర్ శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్త తమపై బిగ్ బాస్ కో ఆర్డినేటర్లు లైంగిక వేధింపులకు, అసభ్య ప్రవర్తనకు పాల్పడినట్లు కేసు నమోదు చేశారు.రాజీ పడినవారికి మాత్రమే షోలో అవకాశాలు కల్పిస్తున్నారని ఆరోపించడంతో తీవ్ర వివాదం నెలకొంది. బిగ్ బాస్ వ్యతిరేకులంతా ఏకమై ఢిల్లీకి చేరుకున్నారు. వీరంతా మూడు ప్రధాన డిమాండ్లతో జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేశారు. తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.