బ్రహ్మానందం : హాస్యనట చక్రవర్తికి ఘన సత్కారం

Feb 3, 2020, 1:20 PM IST

సీనియర్ హాస్య నటుడు పద్మశ్రీ బ్రహ్మనందంను విశాఖలో ఘనంగా సత్కరించారు. ఆయన సినీ ప్రస్థానం 35 ఏళ్ళు పూర్తైన సందర్భంగా విశాఖ గురజాడ కళా క్షేత్రంలో విశాఖ రైటర్స్ అకాడమీ నేతృత్వంలో ఈ వేడుక జరిగింది. బ్రహ్మానందంను విశాఖ బీచ్ లోని ఇండియన్ నేవి విజయ స్తూపం నుండి గురజాడ కళాక్షేత్రం వరకు గుర్రపు బగ్గీపై ఉరేగించారు. అనంతరం వేదిక ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సభకు రాజ్యసభ సభ్యుడు టి సుబ్బరామిరెడ్డి, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, జివిఎంసి కమిషనర్ జి సృజన హాజరయ్యారు.