Aug 1, 2019, 4:26 PM IST
నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి మీడియా సమావేశం నిర్వహించి మరోసారి తన ఆరోగ్య గురించి క్లారిటీ ఇచ్చారు. ఆపరేషన్ తర్వాత ఇన్ఫెక్షన్ సోకడం వల్ల మరోసారి అనారోగ్యానికి గురైనట్లు పోసాని తెలిపారు. మాటిమాటికి జ్వరం రావడం, చెమటలు పడుతుండడంతో బాగా నీరసించిపోయా. తక్కువ సమయంలోనే 10 కేజీల బరువు తగ్గా. దీనితో చనిపోతానేమోనని భయం వేసింది.
తనకు ఆపరేషన్ చేసిన వైద్యుడు ఇన్ఫెక్షన్ సోకిందని గుర్తించడంతో చాలా మేలు జరిగింది. లేకుంటే ఈ పాటికి నా చాల్తీ లేచిపోయేది అని పోసాని అన్నారు. మరోసారి ఆపరేషన్ చేసి ఇన్ఫెక్షన్ తొలగించడంతో ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని పోసాని అన్నారు.