పవన్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీ ఛార్జి

Feb 25, 2022, 10:56 AM IST

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ప్రీమియర్ షో కోసం పవన్ అభిమానులు అర్థరాత్రి నుండే థియేటర్ల వద్దకు చేరుకున్నారు. అర్జున్, మల్లికార్జున, శ్రీరాములు థియేటర్లలో బెనిఫిట్ షోస్ ప్రదర్శించనున్న నేపథ్యంలో అర్థరాత్రి నుండే ఇక్కడ సందడి నెలకొంది. అర్జున్ థియేటర్ దగ్గర పరిస్థితి గొడవ గొడవ గా మారడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి ఆ తరువాత ప్రేక్షకులను లోపలి అనుమతించారు. ఉదయం 5.00 గంటలకు షో ప్రారంభమయింది.