ఎల్జీ పాలిమర్స్ బీభత్సం చూసి ఏడ్చేసిన నారాయణమూర్తి

May 8, 2020, 11:54 AM IST

90వ దశకం లో wTOతో కుదుర్చుకున్స ఒప్పందాల వల్ల జరిగిన దుష్పరిణామాల్లో ఇదొకటని విశాఖ దుర్ఘటన పై పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి అన్నారు. కేవలం కొంత మంది స్వార్ధపరులు అభివృద్ధి పేరుతో ఉత్తరాంధ్రను దుష్పరిణామాలకు ప్రయోగం గా చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్జీ పాలిమార్స్ సంస్థను ప్రధాని మోడీ నిషేధించాలని... ఆ సంస్థ నుండి నష్ట పరిహారం తీసుకోవాలని, వాళ్ళను శిక్షించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో జగన్ నిధులున్నాయా లేవా అని కూడా చూడకుండా ఈ దుర్ఘటనలో చనిపోయిన వారికి ఆర్ధిక సహాయం ప్రకటించి మానవీయ కోణం చూపిస్తున్నందుకు జగన్ మోహన్ రెడ్డి కి నా సెల్యూట్ అన్నారు.