మరోసారి ఫిదా చేయనున్న సాయి పల్లవి, వరుణ్ తేజ్..!

May 16, 2021, 7:23 PM IST

హిట్టైన కాంబినేషన్ రిపీట్ అయితే వచ్చే క్రేజేవేరు. అయితే ఆ కాంబినేషన్ మళ్లీ సెట్ అవ్వటానికి మాత్రం చాలా టైమ్ పడుతుంది. వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ఫిదా సినిమా సూపర్ హిట్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం హిట్ సినిమాకు కొత్తం అర్దం చెప్పినట్లుగా కలెక్షన్స్ వర్షం కురిపించింది. సాయి పల్లవి ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారి ఫుల్ బిజీ అయ్యిపోయింది. దాంతో ఇప్పుడు అదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా డైరక్టర్, ఏమా కథ అంటారా..