ఒకటీ రెండూ.. కాదు ఐదోసారి... (వీడియో)

Oct 9, 2019, 7:07 PM IST

ఎగువ రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురియడంతో ప్రాజెక్టులన్నీ నిండిపోవడం జూరాల ద్వారా నీటి విడుదల కావడంతో శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపిస్తుంది. అయితే వరద నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో డ్యామ్ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రస్ట్ గేట్లు ఎత్తడం ఒకే సంవత్సరంలో ఇది ఐదవసారి అని అధికారులు తెలిపారు. 

శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాలైన ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టులో వరద నీరు వచ్చి చేరడంతో  ఆ ప్రాజెక్టుల నుండి వరద నీరు విడుదల కావడంతో జూరాల నుండి శ్రీశైలం డ్యామ్ కు వరద నీటి ప్రవాహం చేరుతుంది.