భారీగా పట్టుబడ్డ నిషేధిత పదార్థాలు... (వీడియో)

Oct 16, 2019, 8:32 PM IST

కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లె వద్ద నిషేదిత గుట్కా ప్యాకేట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  రాయచూరు నుండి గుంటూరు కు తరలిస్తుండగా గాజులపల్లి మెట్ట వద్ద వాహనాన్ని పట్టుకున్నారు. బోలెరో వాహనంలో తరలిస్తున్న ఈ నిషేదిత పదర్ధాలపై సమాచారం అందుకున్న మహానంది ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి తమ సిబ్బందితో దాడికి పాల్పడ్డారు.  ఈ దాడిలో దాదాపు రూ.3,80,000/- విలువ గల నిషేధిత గుట్కా సంచులని పోలిసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.