హైదరాబాద్ వర్సెస్ పంజాబ్: మ్యాచును చేజేతులా పంజాబ్ కి అప్పగించిన సన్ రైజర్స్

Oct 25, 2020, 2:25 AM IST

IPL 2020: 127 పరుగుల స్వల్ప లక్ష్యం... 6.2 ఓవర్లలోనే 56 పరుగులు చేసిన ఓపెనర్లు... సన్‌రైజర్స్ ఈజీగా మ్యాచ్ గెలుస్తుందని అనుకున్నారంతా. కానీ ఆ తర్వాతే సీన్ మారిపోయింది. ఓపెనర్లు వెంటవెంటనే అవుట్ కావడం, సన్‌రైజర్స్ బౌలర్లకు తగ్గట్టుగా పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడమే కష్టమేంది. సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ కూడా పెవిలియన్ చేరడానికి తొందర పడడంతో ఈజీ అనుకున్న మ్యాచ్ కాస్తా ఆఖరి దాకా ఉత్కంఠభరితంగా సాగింది.