May 18, 2020, 5:26 PM IST
విశాఖ ఏజెన్సీ అరకులో గ్రామాల పర్యటనలో భాగంగా రైతులతో పాటుగా ధాన్యం కట్టలు మోసి కాసేపు ధాన్యం గాలి కెత్తి పనిచేశారు వైయస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి చెట్టి వినయ్. అరకులోయ నియోజకవర్గం హుకుంపేట మండల పర్యటనలో భాగంగా గన్నేరుపుట్టు పంచాయతీ గడ్డవలస గ్రామంలో వరి కట్టలు మోస్తున్న రైతులను చూసి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కర మార్గం చూపుతానని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో జడ్పీటీసీ,ఎంపీటీసీ అభ్యర్థులు రేగం మత్యలింగం, గెమ్మెలి కామేశ్వరరావుతో పాటుగా మండల వైస్సార్సీపీ నాయకులు, యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.