టీడీపీ అంటే...తెలుగు ద్రోహుల పార్టీ..తెలుగు దొంగల పార్టీ...

Jan 27, 2020, 3:17 PM IST

చంద్రబాబు ఉత్తరాంధ్రకు శనిలా దాపురించారని విశాఖపట్నం వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగకుండా అడ్డుకుంటున్నాడని, మండలిలో బిల్లు పాస్ కాకుండా చేశాడంటూ మండిపడ్డారు. విశాఖ ఎల్ఐసి బిల్డింగ్ అంబేద్కర్ విగ్రహం వద్ద టిడిపి నేతల బొమ్మలు పెట్టి, వైసిపి నేత కొండ రాజీవ్, వైసీపీ నేతల ఆధ్వర్యంలో శవ యాత్ర నిర్వహించారు. చింతచచ్చినా పులుపు చావలేదని విరుచుకుపడ్డారు.