Oct 4, 2019, 12:35 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను తూతూ మంత్రంగా అమలు చేయడం కాకుండా శాసనాలను, చట్టాలను చేసి అమలు పరుస్తున్నారన్నాడు. ఆటో కార్మికులకు ప్రతి సంవత్సరం పదివేల రూపాయలను అందించేందుకు ఇప్పటికే చిత్తూరు జిల్లాలో 13 వేల మందిని ఎంపిక చేశామని, ఈ నెల 15వ తేదీన రైతు భరోసా పథకం కింద రైతులకు 8 వేల కోట్ల రూపాయలను అందించనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్ప చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.