ఏపీలో మద్యం దుకాణాల దగ్గర మహిళల నిరసన.. పరిస్థితి ఉద్రిక్తం..

Jun 30, 2020, 12:26 PM IST

కృష్ణ జిల్లా, ఉంగుటూరులో మద్యం అమ్మకాలు చేయద్దని, మద్యం దుకాణాలు వెంటనే ఆపేయాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఉంగుటూరు గ్రీన్ జోన్ గానే ఉన్నప్పటికీ ఇతర ప్రాంతాలనుండి మద్యం కోసం వచ్చే జనాలతో కరోనా పెరిగిపోతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మా గ్రామంలో మద్యం అమ్మకాలు వద్దు, తక్షణమే మద్యం అమ్మకాలు నిలిపివేయాలని మద్యం దుకాణం ఎదుట మహిళలు నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారండంతో ఉంగుటూరు ఎస్.ఐ సత్యనారాయణ జోక్యం చేసుకుని స్ధానికులకు, అది కూడా ఆధార్ కార్డు ఉంటేనే మద్యం అమ్మకాలు చేయాలని సిబ్బందికి సూచించారు. దీంతో గొడవ సద్దుమణిగింది.