Mar 11, 2020, 1:48 PM IST
కర్నూలు జిల్లాలో కాల్ మనీ అరాచకాలకు రామాంజనమ్మ అనే వివాహిత బలైంది. లక్ష అప్పుకు వడ్డీ, బారువడ్డీ, చక్రవడ్డీ కలిసి రెండేళ్లలో పదకొండు లక్షలయ్యింది. అంత కట్టలేనంటే అసభ్యపదజాలంతో దూషించి..అవమానించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో రామాంజనమ్మ విషం తాగి చచ్చిపోయింది. దీంతో ఆమె ముగ్గురు పిల్లలూ అనాథలయ్యారు.