రంగురంగుల దీపాల కాంతులు, అద్భుతమైన పెయింటింగ్స్ తో... విశాఖ అందాలు కనువిందు

Mar 28, 2023, 11:24 AM IST

విశాఖపట్నం : జీ20 సన్నాహక సదస్సు నేపథ్యంలో దేశవిదేశాల నుండి ప్రతినిధులు వస్తుండటంతో బీచ్ సిటీ విశాఖను సర్వాంగసుందరంగా ముస్తాబు చేసింది వైసిపి సర్కార్. కేవలం విశాఖ సుంరీకరణ కోసమే వంద కోట్లకుపైగా ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. నగరంలోని బీచ్ రోడ్డుతో పాటు విదేశీ ప్రతినిధులు వసతిచేసే హోటళ్లకు వెళ్లే మార్గాల్లో రోడ్లను అందంగా తీర్చిదిద్దారు. రోడ్డుపక్కన, డివైడర్లపై చెట్లు, విద్యుత్ స్తంబాలకు రంగురంగుల దీపాలు, గోడలపై అందమైన పెయింటింగ్స్ వైజాగ్ ను ముస్తాబుచేసారు. ఏయిర్ పోర్ట్ మార్గాన్ని కూడా సరికొత్తగా మార్చేసారు.