గుడికోసం రెండుగా చీలిన ఊరు.. తలలు పగలగొట్టుకుని ఘర్షణ.. ఎక్కడంటే..

May 19, 2020, 11:18 AM IST

కర్నూల్ లో ఓ గుడి విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లోకి వెడితే కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కల్లపారిలో కర్రెమ్మ గుడి విషయంలో గ్రామంలోని మాదిగ బోయ కులస్తుల మధ్య గొడవ జరిగింది. దారి మధ్యలో కర్రెమ్మవిగ్రహానికి గుడి కడుతుండడంతో మాకు అడ్డువస్తుందనడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలయ్యింది. మాటా, మాటా పెరిగి ఇరు వర్షాలూ కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘర్షణలో చాలామందికి గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.