Video : పార్టీలో ఎంతటివారైనా గీతదాటితే చర్యలే...విజయసాయి రెడ్డి హెచ్చరిక

Dec 7, 2019, 4:23 PM IST

మాఫియాకు అండగా నెల్లూరు అన్న అధికార పార్టీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి వ్యాఖ్యలను పార్టీ సీరియస్ గా తీసుకుంది. దీనిమీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం అని, ఏదైనా అసంతృప్తి ఉంటే అధిష్టానం దృష్టికి తేవాలని అన్నారు. అంతేకానీ ఎంతటివారైనా గీత దాటితో చర్యలు తప్పవన్నారు. అది విజయసాయిరెడ్డి అయినా, సుబ్బారెడ్డి అయినా మరొకరు అయినా మినహాయింపు లేదన్నారు.