Feb 18, 2020, 8:05 AM IST
కృష్ణాజిల్లా కంచికచెర్ల మండలం నక్కలంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అమ్రితసాయి కాలేజీకి చెందిన బస్సు ను బైకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వారిద్దరిలో ఒకరు పెనుగంచిప్రోలుకు చెందినవారు కాగా, ఇంకొకరు నక్కలం పేట గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.