దారుణం.. పెళ్లి పందిరి వేస్తుండగా కూలిన మిద్దె.. తల్లీకూతురు మృతి...

Jul 26, 2020, 4:36 PM IST

కర్నూలు జిల్లా, ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.  పెళ్లి ఇంట్లో పెళ్లి పందిరి వేస్తుండగా మట్టి మిద్దె కూలి తల్లి బిడ్డ మృతి చెందారు. ఇంకో బిడ్డకు కాళ్లు విరిగాయి, ప్రమాదం జరిగిన వెంటనే ఫోన్ చేసినా అధికార యంత్రాంగం స్పందించలేదు. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా 108 రాకపోడంతో ఆటోలో ఆస్పత్రికి తరలించారు.