మీ ఆటలు సాగనివ్వం...మీడియాకు మొట్టడం రాజబాబు హెచ్చరిక...

Feb 13, 2020, 2:04 PM IST

పాడేరులో జరిగిన ఆదివాసి ఆత్మగౌరవ సభలో జీకేవీధికి చెందిన ఆదివాసి జే.ఏ.సీ. నేత మొట్టడం రాజబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాకు సోషల్ మీడియా ఉంది..ఏజెన్సీకి అన్ని పత్రికలను రానివ్వబోమని టీవీ, ఛానళ్లను నిలిపివేస్తామని హెచ్చరిస్తూ స్థానిక మీడియా ప్రతినిధులను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడారు. దీంతో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఆయనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాజబాబు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ లను పోలీస్ లకు అందజేశారు.