పిడుగురాళ్లలో నారా లోకేష్ కటౌట్ కు పాలాభిషేకం, పూల వర్షం

Jun 25, 2021, 5:33 PM IST


పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్ద తెలుగు యువత, తెలుగు విద్యార్థుల ఆధ్వర్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కటౌట్ కు పాలాభిషేకం చేశారు. పరీక్షల నిర్వహణకు జగన్ సర్కార్ సిద్దపడితే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రాణరక్షణ కోసం రెండు నెలలుగా అలుపెరగని పోరాటం చేసిన లోకేష్ చివరికి విజయం సాధించారని తెలుగు యువత ఆర్గనైజేషన్ సెక్రెటరీ దియ్య రామకృష్ణ, టి.ఎన్.ఎస్.ఎఫ్ నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షులు కె. హనుమంతరావు పేర్కొన్నారు. పరీక్షల రద్దు నిర్ణయాన్ని హర్షిస్తూ ఈ పాలాభిషేకం కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.