వైసిపి కాదు టిడిపికి 175 సీట్లు... సీఎం చంద్రబాబే : ఎమ్మెల్సీ అనురాధ

Mar 31, 2023, 1:58 PM IST

అమరావతి :ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు 1200 రోజులుగా ఉద్యమం చేస్తూ ఉండటం చాలా గొప్ప విషయమని టిడిపి ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. రాజధాని ఎక్కడికీ తరలిపోదని... చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక మళ్లీ  అమరావతి నిర్మాణం పునఃప్రారంభం అవుతుందన్నారు. వైసిపి కాదు టిడిపియే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుస్తుందని... చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అనురాధ అన్నారు.