నల్ల చొక్కాలతో అసెంబ్లీకి టీడీపీ నేతలు

Jun 16, 2020, 10:58 AM IST

అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి ల అరెస్టు, టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ నేతలకు నల్లచొక్కాలతో హాజరయ్యారు. సంప్రదాయ పచ్చచొక్కాలకు పక్కన పడేసి నల్ల చొక్కాలతో అసెంబ్లీకి హాజరయ్యారు. సమావేశాలకు ముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి, ప్లకార్డులతో నిరసన తెలుపుతూ అసెంబ్లీకి వచ్చారు.