లాక్ డౌన్ సవరణల విషయంలో రాష్ట్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తుంది.. వడ్డే శోభనాద్రీశ్వరరావు

May 12, 2020, 5:34 PM IST

లాక్ డౌన్ పై సవరణ ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని కృష్ణాజిల్లా పెనమలూరు నియోజవర్గం ఉయ్యూరులో మాజీ మంత్రి... వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మే 4వ తేదీనుండి దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ సమయంలో చేయతగిన, చేయకూడని పనుల గురించి మే ఒకటో తారీఖున కేంద్ర హోం శాఖ వారు స్పష్టమైన ప్రకటన చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు.