చంద్రబాబునాయుడు : అరెస్టులు చాలా దుర్మార్గం..జగన్ ది పిరికిపంద చర్య...

Jan 20, 2020, 12:36 PM IST

ఏపీ రాజధాని అమరావతిని నిలబెట్టుకొంటామని, ఏపీ చరిత్రలో ఈ రోజు బ్లాక్ డే అని చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం నాడు అసెంబ్లీకి పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబునాయుడు ర్యాలీగా బయలుదేరారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని, ఐదు కోట్ల ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. చరిత్రలో ఎన్నడూ జరగని దారుణాలకు ప్రస్తుత ముఖ్యమంత్రి ఒడిగడుతున్నాడని విరుచుకుపడ్డాడు.