Jun 28, 2021, 12:29 PM IST
ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు సోమవారం ఆందోళనలు చేపట్టాయి. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇంటిని విద్యార్థులు ముట్టడించే ప్రయత్నం చేశారు. దాంతో విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి ఎస్ వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు.