May 1, 2020, 12:22 PM IST
గుంటూరులో దారుణమైన ఘటన జరిగింది. మాచవరం మండలం పిన్నెల్లి లో ఇంటిముందు ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి సఫియపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో సఫియా తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు పాపను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పాప మృతి చెందింది.