రైతు దినోత్సవంలా లేదు అడ్వర్టైజ్ మెంట్ లా వుంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

Jul 10, 2020, 10:55 AM IST

రూ.20వేల కోట్ల బడ్జెట్ లో రూ.7వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి రైతు దినోత్సవం అనటం విడ్డూరంగా ఉంది.అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది జగన్ ప్రభుత్వం 20వేల కోట్లు పైగా బడ్జెట్ లో పెట్టి 37శాతం మాత్రమే ఖర్చుపెట్టి 63శాతం నిరూపయోగం చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన ఎన్నో ప్రాథమిక కార్యక్రమాలు నిలిపివేశారు.రెండో ఏడాదీ 22వేల కోట్లు బడ్జెట్లో వ్యవసాయానికి పెట్టారు అవన్నీ ఖర్చు చేసి చూపాలి.