శ్రీశైలం ఆలయంలో పాము హల్ చల్..

Jun 29, 2020, 12:24 PM IST

కర్నూలు జిల్లా శ్రీశైలం స్వామి అమ్మవార్ల క్యూలైన్లలో పాము కనిపించడంతో భక్తలు భయాందోళనల్లో పడ్డారు.  శ్రీకృష్ణ దేవరాయగోపురం నుండి భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివారి దర్శనానికి వెళ్లే క్యూ లైన్ లో ఓ పాముపిల్ల వచ్చింది. దాన్ని చూసిన భక్తులు కంగారు పడ్డారు. దేవస్థాన సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే దర్శనాలను నిలిపివేసి, స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు. వారు పామును పట్టుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పాముతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో భక్తులు, ఆలయ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.