అమరావతి భూములపై సిట్ విచారణ ప్రారంభం

Mar 1, 2020, 10:57 AM IST

కృష్ణాజిల్లా రాజధాని భూముల అక్రమాలపై సిట్ విచారణ ప్రారంభం అయింది.  సిట్ తో కలసి విచారణ సాగిస్తున్న సీఐడీ అధికారులు కంచికచర్ల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నన్నపనేని లక్ష్మీనారాయణ ఇంటికి  సర్చ్ నోటీసులు అంటించారు .అధికారులు వచ్చే సమయానికి ఇంటికి తాళాలు వేసివుండడం తో ఇంటి తలుపులకి అంటించి ఇంట్లోకి ఎవరు వెళ్లకుండా పోలీసులను కాపలా ఉంచారు .లక్ష్మీనారాయణ కుమారుడు సీతారామరాజు  రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటుగా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్ గా ఉన్నాడు .లక్ష్మీనారాయణ అల్లుడు దమ్మాలపాటి శ్రీనివాసరావు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ వున్నాడు .