రెండో రోజూ కొనసాగుతున్న మన్యం బంద్.. నడవని బస్సులు.. మూతపడ్డ దుకాణాలు..

Jun 18, 2020, 11:33 AM IST

విశాఖ ఏజెన్సీ, చింతపల్లిలో జీవో నెం3 రద్దుకు నిరసనగా గిరిజనసంఘాలు, ఉపాధ్యాయ ఉద్యోగసంఘాలు 48గంటల నిరవధిక మన్యం బంద్ రెండోరోజు కూడా కొనసాగుతోంది. కాగా జీవో నెం3 పునరిద్దిచే వరకు పోరాటం కొనసాగిస్తామని గిరిజననేతలు చెబుతున్నారు. ఏజెన్సీలో రె౦డవ రోజు దుకాణాలు, వాణిజ్య సముదాయాలు స్వచ్చందంగా మూతపడ్డాయి. పాడేరులో బస్సులు నిన్నటి నుండి డిపోకే పరిమితమయ్యాయి.  GO నె౦. 3ని పునరుద్దరి౦చాలని, గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.