పల్నాడు జిల్లాలో‌‌ ఘోర రోడ్డు ప్రమాదం... పెళ్లి బృందం కారు‌ను ఢీ కొట్టిన టిప్పర్...

Jan 27, 2023, 11:05 AM IST

పల్నాడు : పల్నాడు జిల్లాలో‌‌ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం వెడుతున్న కారును ‌టిప్పర్ ఢీ కొట్టింది. వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామం సమీపంలో కారును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో నల్గురు మృతి చెందారు. మృతులలో‌ కారుడ్రైవర్, ఒక మహిళా, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కారులో పది మంది ప్రయాణిస్తున్నారు. గాయపడిన వారిని మాచర్ల ప్రభుత్వ హాస్పటల్ కు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వం హాస్పటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు.