జుత్తాడ ఫ్యామిలీ మర్డర్... పోలీసులు ఏమంటున్నారంటే..

Apr 15, 2021, 2:05 PM IST


విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అతి కిరాతకంగా హతమార్చబడ్డారు. ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా 
స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇది చాలా దారుణమని... ఆరుగురిని ఒకే వ్యక్తి చంపినట్లు అనుమానం వ్యక్తం చేశారు. కారణం ఏదయినా ఇలా చేసి వుండాల్సింది కాదని పోలీస్ అధికారి పేర్కొన్నారు.