వలసకూలీలపై పోలీసుల లాఠీఛార్జి.. భయంతో పరుగులు తీసిన కార్మికులు...

May 16, 2020, 2:01 PM IST

తాడేపల్లి, వలసకూలీలను స్వస్థలాలకు పంపాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు.. వెయ్యిమంది వలస కార్మికులకు విజయవాడ క్లబ్ లో పునరావాసం కల్పించారు. శనివారం ఉదయం అల్పాహారం సమయంలో కొంతమంది కూలీలు తాము తమ సైకిళ్ల మీద సొంతూర్లకు పోతామంటూ రోడ్డుపైకి వెళ్లారు. దీంతో తాడేపల్లి వారధి వద్ద ఉన్న చెక్ పోస్ట్ లోని పోలీస్ సిబ్బంది వీరిని అడ్డుకుని అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కార్మికులపై విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. భయంతో కార్మికులు సైకిళ్ళు తమ వస్తువులను విడిచి పరుగులు పెట్టారు. అనంతరం వారిని విజయవాడ క్లబ్ పునరావాసానికి తరలించారు.