చంద్రబాబుతో టచ్ లో కోటంరెడ్డి... ఫోన్ ట్యాపింగ్ నాటకం అందుకోసమే..: పేర్ని నాని

Feb 3, 2023, 10:20 AM IST

అమరావతి : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసిపి ప్రభుత్వం సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే ఫోన్ ట్యాపింగ్ చేస్తోందన్న ఆరోపణలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. డిసెంబర్ 25న కోటంరెడ్డి చంద్రబాబు నాయున్ని టిడిపి చేరిక కోసం చర్చలు జరిపారని... వైసిపిని వీడాలని నిర్ణయించుకున్నాకే ఫోన్ ట్యాపింగ్ అంటూ నాటకాలాడుతున్నాడని అన్నారు. ఇప్పటికీ  చంద్రబాబు తో కోటంరెడ్డి టచ్ లో ఉన్నాడన్నారు. కోటంరెడ్డిని జగన్ ఎంతగానో నమ్మారని... అలాంటిది ఆయనకే నమ్మకద్రోహం చేసాడని పేర్ని నాని అన్నారు.