రాత్రి పూట ఊర్లో కరెంటు తీసి.. కరోనా మృతదేహం ఖననం...

Jul 16, 2020, 10:38 AM IST

తుళ్ళూరు బాలయేసు కాలనీలో ఉన్న స్మశానవాటికలో రాత్రిపూట కరోనా మృతదేహాన్ని ఖననం చేయడం కలకలం రేపింది. రాత్రి తొమ్మిదిన్నర సమయంలో ఊర్లో మొత్తం కరెంట్ తీసేసి, స్మశానం గేట్లు పగలగొట్టి ఓ శవాన్ని పూడ్చడం అనుమానాలకు తెరతీసింది. అతను మామూలుగానే చనిపోయాడని సిబ్బంది చెబుతున్నా.. మున్సిపల్ వాహనంలో తీసుకురావడం, పీపీఈ కిట్లు వేసుకుని ఖననం చేయడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.