May 6, 2020, 2:18 PM IST
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురంలో కూల్ డ్రింక్స్ కోసం ప్రజలు ఎగబడ్డారు. ఇప్పటికే నారయణపురంలో 12 కరోన పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నారాయణపురం రెడ్ జోన్ లో ఉంది. అయితే కూల్ డ్రింక్స్ కోసం వచ్చిన వారు గుంపులుగా ఎగబడుతున్నా షాపు యాజమాన్యం కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ప్రజలు కూడా సామజిక దూరం పాటించడం లేదు. అధికారులు కూడా చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.