అంతర్వేదిలో పవన్ వెంట జనసైనికుల ర్యాలీ (వీడియో)

Sep 6, 2019, 3:20 PM IST

తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని శుక్రవారం నాడు దర్శించుకొన్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనను పురస్కరించుకొని అంతర్వేదిలో భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్లకు ఇరువైపులా వపన్ అభిమానాలు నిలబడి ఆయనకు స్వాగతం పలికారు.

రెండు రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.గురువారం నాడు పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాకు చేరుకొన్నారు.