ఈసీ కేసులాగే మూడు రాజధానుల కేసు లో తీర్పు.. నిమ్మకాయల సంచలన కామెంట్స్

Jul 31, 2020, 11:30 AM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పునర్నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం చాలా సంతోషం అని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.  రాజధాని మార్పు, మూడు రాజధానుల విషయం కూడా ఇలాగే సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా విషయంలో రాష్ట్రంలో దారుణ పరిస్థితి నెలకొందని విరుచుకుపడ్డారు. ఈస్ట్ గోదావరిలో స్వయంగా తానే కో ఆర్డినేట్ చేసినా ప్రైవేట్ ఆస్పత్రిలో బెడ్లు దొరకలేదని వాపోయారు.