ప్రశాంత్ వర్మ కథ మాత్రమే సమకూరుస్తాను. డైరెక్షన్ తన శిష్యుడు చేస్తాడని బాలయ్యతో చెప్పాడట. ప్రతిష్టాత్మకమైన మోక్షజ్ఞ ఫస్ట్ చిత్రాన్ని కొత్త దర్శకుడు తీయడం ఏమిటని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడట. బాలయ్య-ప్రశాంత్ వర్మ మధ్య చర్చలు జరుగుతున్నాయట. అందుకే డిసెంబర్ 5న లాంచ్ కావాల్సిన మోక్షజ్ఞ మూవీ వాయిదా పడిందట.
ఒకవేళ మోక్షజ్ఞతో మూవీ పట్టాలెక్కని పక్షంతో అదే కథతో నిర్మాత డీవీవీ దానయ్య కొడుకుతో సినిమా చేయాలి అనేది ప్రశాంత్ వర్మ ఆలోచన అట. ఇక బాలకృష్ణ కూడా ప్రత్యామ్నాయం వెతికే పనిలో ఉన్నాడట. ప్రశాంత్ వర్మకు హనుమాన్ హిట్ తో పొగరు తలకు ఎక్కిందని ఇండస్ట్రీ టాక్. అన్ స్టాపబుల్ సీజన్ 4 ట్రైలర్ కట్ కోసం ప్రశాంత్ వర్మను సంప్రదించగా పెద్ద మొత్తంలో డిమాండ్ చేశాడట. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ జై హనుమాన్ టైటిల్ తో మూవీ చేస్తున్నారు. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు..