జేసీ ఫ్యామిలీ పరామర్శకు బయలుదేరిన నారా లోకేష్

Jun 15, 2020, 8:28 AM IST

వాహనాల కొనుగోలు ఆరోపణలపై అరెస్టయిన తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. అందుకుగాను ఆయన అనంతపురం బయలుదేరారు. కరోనా కారణంగా జేసీ ప్రభాకర్ రెడ్డిని, అస్మిత్ రెడ్డిని జైలులో కలిసే అవకాశం లేకపోవడంతో నారా లోకేష్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించాలని అనుకున్నట్లు తెలుస్తోంది.