Jun 3, 2020, 10:21 AM IST
గుంటూరు జిల్లా , దాచేపల్లిలో యెర్రమోతు అశోక్ అనే వ్యక్తిపై సయ్యద్ రఫీ అనే వ్యక్తి కత్తితో దాడి చేయగా అశోక్ చెయ్యి తెగి తీవ్ర రక్తస్రావం అయ్యింది. అతన్ని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స్ అందిస్తున్నారు. వివరాల్లోకి వెడితే పొందుగుల పంచాయతి సెక్రటరీ సయ్యద్ జాన్ పీరా, అక్కడే వాలంటీర్ గా పనిచేసే అశోక్ చెల్లెల్ని గత రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు.అయితే జాన్ పీరా కు అంతకుముందే వేరే వివాహం అయింది. ఇద్దరు పెళ్ళికి ఎదిగిన పిల్లలు కూడా ఉన్నారు. దీంతో చెల్లెల్ని మాయమాటలతో లోపర్చుకున్నారంటూ అశోక్, జాన్ పీరా వద్దకు వెళ్తుండగా ఆయన తమ్ముడు రఫీ ఎదురు పడ్డాడు. వారిద్దరి మధ్య సంభాషణఘర్షణకు దారితీయటంతో రఫీ కత్తితో అశోక్ పై దాడి చేశాడు.