ఎమ్మెల్యే వెలగపూడిని అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు.. పరిస్థితి ఉద్రిక్తం..

Jun 15, 2020, 12:56 PM IST

విశాఖలో ఓ రోడ్డు శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును వైస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరగడంతో కొంతమంది కార్యకర్తలు గాయపడ్డారు. ఆటోల్లో వచ్చిమరీ దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కార్యకర్తలకు న్యాయం జరిగేంత వరుకు అక్కడే బైఠాయించి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ నిరసన తెలుపుతుండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.