నాని, బోండా ఉమా విజయవాడకు పట్టిన చీడ పురుగులు.. వెలంపల్లి శ్రీనివాసరావు..

May 4, 2020, 3:56 PM IST

టీడీపీ నేతలు కేశినేని నాని, బోండా ఉమల మీద దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. వీరిద్దరూ విజయవాడకు పట్టిన చీడపురుగులని చీదరించుకున్నాడు. పుష్కరాల సమయంలో చర్చిలు మసీదులు గుళ్ళు పడగొట్టిన ప్రజాద్రోహి కేసినేని నాని అని, 
తన ఆర్థిక పెరుగుదలకు కారణమైన కేశినేని ట్రావెల్స్ ఉద్యోగుల ను సైతం మోసం చేసిన వ్యక్తి కేశినేని నాని అని మండిపడ్డారు. ఇక తాగి వచ్చి, మద్యం సీసాలతో ప్రెస్ మీట్ పెట్టే బోండా ఉమా, వ్యాపారుల వ్యతిరేకి అని విరుచుకుపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్ లో జగన్ మీద అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటు మండిపడుతున్నారు వెల్లంపల్లి.